కుటుంబంపై విరక్తి చెంది కొందరు శేష జీవితం కోసం హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారు మరికొందరు కాశీకి వెళ్ళి అఘోరులుగా మారుతుంటారు, కానీ అగోరీలు (మహిళలు) చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నిన్న శనివారం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఈ ఆలయం ఉన్నది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంగా, తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. మల్లన్న పట్నాలు కూడా వేసుకుంటారు. ఈ కొమురవెల్లి మల్లన్న స్వామిని బండ సొరంగంలో వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది.ఈ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవి ఆలయం ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. తాజాగా మహిళా అఘోరీ కొమురవెల్లి దేవాలయానికి వచ్చింది. ఆమెను భక్తులు ఆశ్యర్యంగా చూశారు. పూజారులు అడగగా ఈ అగోరి రావడం ఇదే ప్రథమంగా భావిస్తున్నామని తెలియజేశారు.