జనసేన పార్టీలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

0
గుంటూరు:ఆర్య వైశ్య సంఘ ముఖ్య నాయకులు బుధవారం జనసేన పార్టీలో చేరారు.చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు (విజయవాడ), వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు, దేవకీ వెంకటేశ్వర్లు (కనిగిరి), కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు, భవనాసి శ్రీనివాస్ (నంద్యాల) బుధవారం నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్  ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు,అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ వారి ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *