తాలూకా మున్నూరుకాపు సంఘం సౌజన్యంతో మున్నూరుకాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆషాడ మాసంలో (గోరింటాకు పెట్టుకోవడం) మెహందీ కార్యక్రమం ఈనెల 19 న శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాటుచేసినారు.కావున మున్నూరుకాపు మహిళా మణులు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.మున్నూరుకాపు మహిళా సంఘం అధ్యక్షులు దేశెట్టి ప్రభ, ప్రధాన కార్యదర్శి జోగు రమణి, కోశాధికారి గంట స్వప్న , ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు కాళ్ల విఠల్, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్ కోశాధికారి కైపెల్లి జైపాల్, తదితరులతో పాటు మున్నూరు కాపు మహిళలు సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు.