శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ భార్య శ్రీమతి అన్న కొణిదల

0

 ఆంధ్ర ప్రదేశ్ : తిరుమల తిరుపతి  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల సోమవారం దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు.స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.స్వామి వారి దర్శనానంతరం ఉదయం10 గంటల సమయంలో శ్రీమతి అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు.భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని స్వయంగా ఆమె వడ్డించినారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. స్థానికంగా వచ్చిన భక్తులకు ఆమె చిరునవ్వుతో ఆప్యాయతతో పలకరించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *